Sunday, April 19, 2020

“నేను ఎవరు ?” అని మంత్రంలాగా జపిస్తూ ఉండవలెనా?

🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌻

                  సాధువు : 
“నేను ఎవరు ?” అని మంత్రంలాగా జపిస్తూ ఉండవలెనా?

                  మహర్షి : 
  అవసరం లేదు. 'నేను ఎవరు' అన్నది మంత్రం కాదు. దానికి అర్థం అన్ని ఆలోచనలకు మూలమైన 'నేను' అనే ఆలోచన నీలో ఎక్కడ పుడుతోందో కనుక్కోవాలని. 
  
     కానీ నీకు ఈ విచారణా మార్గం కష్టమనిపిస్తే 'నేను', 'నేను' అని మరలా మరలా వల్లెవేస్తూ ఉండు. ఇది ఆ గమ్యానికి చేరుస్తుంది. 'నేను' ను మంత్రంగా ఉపయోగించుకుంటే కలిగే నష్టం ఏమీలేదు. అది దైవానికి మొదటి పేరు. 
     
   దైవం అంతటా ఉన్నాడు. కానీ దైవాన్ని ఆ విధంగా ఊహించడం చాలా కష్టం. అందుకే శాస్త్రాలు, “దైవం అంతటా ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నీవే దైవం; కాబట్టి ఆ సంగతిని సదా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు" అంటాయి. 
   
   'నేను' అని జపిస్తూ ఉంటే, అదే చివరకు నిన్ను 'నేనే బ్రహ్మాన్ని' అన్న స్థితికి చేరుస్తుంది.

               🌺ఓం తత్సత్🌻

Labels:

0 Comments:

Post a Comment

<< Home