Thursday, October 10, 2019

Periya Puraanam . Madhava Teerdha on receptivity of divine grace and vibrations

స్వామి మాధవ తీర్ధ : రమణ మహర్షీ ! మీ సన్నిధి లో కూర్చుని , మీ అనుగ్రహమును ( మీ నుంచి ప్రసరితమయ్యే చైతన్య శక్తి ని ) అందుకొనుటకు , మేము ఏ విధమైన మానసిక స్థితి ని కలిగి ఉండాలి ? 

రమణ మహర్షి : మీ మనసును నిశ్చలము గా ఉంచుకొనండి . అది చాలును . మీ మనసు ను నిశ్చలము గా ఉంచుకొన గలిగితే, ఈ హాలు లోని ఆధ్యాత్మిక సహాయము ను మీరు అందుకొన గలరు . అధ్యాత్మిక సాధనలన్నింటి అంతిమ ఉద్దేశ్యము - సాధనలను వదిలి వేయుటయే ! 


మనసు నిశ్చలమైనప్పుడు , ఆత్మ ( చైతన్యము ) యొక్క శక్తి అనుభూతమౌతుంది . చైతన్యము యొక్క తరంగములు విశ్వమంతయూ వ్యాపించి ఉన్నవి . మనసు గనక నిశ్చలం గా , శాంతి తో ఉంటే , ఎవరైనా వాటిని అనుభవించగలరు .  


స్వామి మాధవ తీర్ధ ఇంకా ఇలా చెప్పారు . " రమణులు అభిన్న ( అద్వైత ) భావము తో ఉండుట నూ , సాధకులు ఆయన సమీపము లో ఉండుటనూ , నేను రేడియో ట్రాన్స్మిటర్ మరియు రేడియో రిసీవర్ ల తో పోలుస్తాను . 


మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తి , సూర్య కాంతి వలె ఎడతెగకుండా , నిరంతరం ప్రసరింప బడేది . ఆయన కు సంబంధించినంత వరకు . కానీ , మాయ తో కప్ప బడ్డ సాధకులు ఆ శక్తి యొక్క ప్రసారము అందుకునే యోగ్యత సంపాదించుకునే వరకు - మహర్షి అద్భుత ఆధ్యామిక శక్తి ప్రసారము వలన కలిగే ప్రయోజనము ఏమీ అనుభవించ లేరు . సాధకులకు ఆ శక్తి ని అందుకునే సంసిద్ధత నే ' అనుగ్రహము యొక్క చర్య ' ( Diviine Grace )  అంటారు . 

మూలం : పెరియ పురాణము . 276 పేజి .

0 Comments:

Post a Comment

<< Home